శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను రేపు తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. మే, జూన్ నెలలకు సంబంధించిన రూ.300 దర్శన టికెట్లను రేపు ఉదయం 10గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://tirupatibalaji.ap.gov.in/ లో మాత్రమే దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. అలాగే TTDevasthanams మొబైల్ యాప్ ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. నకిలీ వెబ్ సైట్లు ఓపెన్ చేసి మోసపోవద్దని కోరింది. కాగా ఇటీవల టీటీడీ పేరుతో ఉన్న నకిలీ వెబ్సైట్ అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే.
రేపే టీటీడీ ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
0
287
Previous article
Latest Articles
బాలయ్య సినిమాల.. ప్లానింగ్ మారుతుందా..?
నందమూరి బాలకృష్ణకి.. షూటింగ్లో గాయాలు అవ్వడం తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో బాలయ్య సినిమాల...
- Advertisement -
- Advertisement -


