రవీంద్ర భారతిలో ‘ఎల్ నినో – తెలంగాణ సన్నాహకత’ సదస్సు

హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ‘ఎల్ నినో – తెలంగాణ సన్నాహకత’ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గితే జల విద్యుత్ ఉత్పత్తి పడిపోయి విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతుందన్నారు. ప్రస్తుతం వర్షాకాలంలోనూ ఏప్రిల్ నాటి పీక్ డిమాండ్ నమోదవుతోందని తెలిపారు. ఆర్థిక భారం తగ్గించుకునేందుకు రైతులు, ప్రజలు పగటిపూట లభించే చౌకైన సోలార్ విద్యుత్‌ను గరిష్టంగా వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం మంత్రి అజహరుద్దీన్ మాట్లాడుతూ.. ఎల్ నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు.

Latest Articles

సుకుమార్.. మార్పు కోరుకుంటున్నారా..?

క్రియేటీవ్ జీనియస్ సుకుమార్.. పుష్ప 2 రిలీజై సంవత్సరంన్నర అయినా ఇంత వరుకు కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీని స్టార్ట్ చేయడానికి సుకుమార్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్