ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రధాని మోదీ నివాసం దగ్గర కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. విద్యార్థులపై లాఠీఛార్జ్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఈ నిరసన కార్యక్రమం చేపట్టింది. ధర్నాలో ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక, ఖర్గే, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. చేతులకు తాళ్లు కట్టుకుని కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. ప్రధాని మోదీ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. మోదీ ఇంటి ముందు కాంగ్రెస్ నేతలు బైఠాయించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రధాని మోదీ నివాసం దగ్గర కాంగ్రెస్ నేతల ధర్నా
0
52
Previous article
Latest Articles
క్షమాపణ చెబుతారని అనుకన్నా.. కానీ డైవర్షన్ చేస్తున్నారు- స్పీకర్
అసెంబ్లీ దగ్గర నిన్న జరిగిన ఘటనపై సభలో క్షమాపణ చెబుతారని అనుకున్నానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. చిట్చాట్లో మాట్లాడిన ఆయన.. వాస్తవానికి మైక్ ఇవ్వద్దు.. తాను స్పీకర్గా నాలుగు వైపుల...
- Advertisement -
- Advertisement -


