గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం రిజిస్ట్రార్ ఆఫీస్ ఎదుట స్టాంప్ రైటర్లు నిరసన తెలిపారు. స్టాంప్ రైటర్ల పొట్టకొట్టేలా జీవో 369ను తీసుకొచ్చారన్నారు. జీవో 369ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 20 నుంచి 31 వరకు పెన్డౌన్ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఫ్రంట్ ఆఫీసులను ఏర్పాటు చేసి కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం చూస్తుందని స్టాంప్ రైటర్లు ఆరోపించారు. దశాబ్దాల తరబడి ఈ వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నామన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు, కాకుమాను మండలాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయన్నారు. ఇక నుంచి ఇక్కడ పనిచేస్తున్న స్టాంప్ రైటర్లు ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్తిపాడు రిజిస్ట్రార్ ఆఫీస్ ఎదుట స్టాంప్ రైటర్ల నిరసన
0
58
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


