టీ20లకు పనికిరాడన్నారు.. ఇప్పుడు దుమ్ము రేపుతున్నాడు

ఈ ఐపీఎల్ సీజన్ లో టీమిండియా సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే(34) పేరు మార్మోగిపోతోంది. టెస్టు ఆటగాడిగా ముద్రపడిన రహానే ఆట చూసి అందరూ ఫిదా అయిపోతున్నారు. గత కొన్నేళ్లుగా ఫామ్ లేమితో టీమిండియా జట్టుకు దూరమైన రహానే.. గతేడాది ఐపీఎల్ లో కేకేఆర్ జట్టు తరపున ఆడాడు. అయితే రహానే రాణించకపోవడంతో జట్టు యాజమాన్యం అతడిని వదులుకుంది. దీంతో మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కేవలం రూ.50లక్షలకే రహానేను సొంతం చేసుకుంది.

తొలి రెండు మ్యాచులకు దూరంగా పెట్టిన కెప్టెన్ ధోని.. మూడో మ్యాచులో రహానేకు అవకాశం ఇచ్చాడు. అంతే వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటూ 61 పరుగులతో రెచ్చిపోయాడు. తర్వాతి మ్యాచుల్లోనూ 31, 37 పరుగులు చేశాడు. ఇక ఆదివారం కేకేఆర్ జట్టుతో జరిగిన మ్యాచులో అయితే విధ్యంసం సృష్టించాడు. కేవలం 29 బంతుల్లో 71 పరుగులు చేశాడు.

ఏ జట్టు అయితే తనను అవమానించి వదులుకుందో అదే జట్టుపై ఇలా ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 5 మ్యాచ్ లు ఆడిన రహానే.. 199 స్ట్రైక్ రేటుతో 209 పరుగులు చేశాడు. టీ20లకు పనికిరాడన్న వారి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు.

Latest Articles

కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?

నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్