ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు రెండవ సారి విచారణకు హాజరుకానున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత(MLC Kavitha).. ఈడీ అధికారులకు ఝలక్ ఇచ్చారు. అనారోగ్యం కారణం చేత తాను ఇవాళ విచారణకు హాజరు కాలేనని అన్నారు. తన న్యాయవాదులతో చర్చించిన అనంతరం.. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ ద్వారా సమాచారం పంపించింది కవిత. ఈడి డైరెక్టర్ స్పందిస్తూ.. ఏదేమైనా విచారణకు హాజరుకావాల్సిందే అని తేల్చి చెప్పినట్లు సమాచారం. అయితే తాను అరెస్ట్ అవుతానని భావించే.. విచారణకు హాజరు కాలేనని కవిత చెప్పిందంటూ.. ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.
Read Also: సిరిసిల్ల జిల్లాలో విద్యార్థినులకు అస్వస్థత.. ఆరుగురి పరిస్థితి విషమం
Follow us on: Youtube Instagram