స్వతంత్ర, వెబ్ డెస్క్: తిరుమలలో పెను ప్రమాదం తప్పింది. కొండపై నుంచి తిరుపతికి వెళ్తున్న టెంపో వాహనం మొదటి ఘట్ రోడ్డులో బోల్తాపడింది. కర్ణాటకలోని కోలార్కు చెందిన భక్తులు శ్రీవారిని దర్శించుకుని తిరుపతి బయలుదేరారు. మొదటి ఘాట్ రోడ్డులో ఆరో మలుపు వద్దకు రాగానే వాహనం రోడ్డు పక్కన ఉన్న గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13మంది భక్తులు గాయపడ్డారు. భద్రతా సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన భక్తులను రుయా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆదేశించడంతో వారిని రుయా నుంచి బర్డ్ హస్పిటల్కు తరలించారు. మరోవైపు ఇటీవల ఘాట్ రోడ్డులో వరుసగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడంపై నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తిరుమల ఘాట్ రోడ్డులో వాహనం బోల్తా.. పలువురికి గాయాలు
0
324
Previous article
Latest Articles
కాంగ్రెస్లో మళ్లీ నామినేటెడ్ పదవుల టెన్షన్ మొదలయ్యిందా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల టెన్షన్ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దక్కించుకున్న నేతలకు ఇప్పుడు రెన్యువల్ గుబులు పట్టుకుంది. జూలై నెలాఖరుతో వీరి పదవీకాలం...
- Advertisement -
- Advertisement -


