మోదీ గ్యారంటీపై ప్రజలకు నమ్మకం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. CAA చట్టమే మోదీ గ్యారంటీకి తాజా ఉదాహరణ అని అన్నారు. ఆజాంఘడ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. ప్రతిపక్ష ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలంతా బీజేపీ, ఎన్డీఏ కూటమితోనే ఉన్నారని స్పష్టం చేశారు. సీఏఏ కింద భారత పౌరసత్వం ఇవ్వడం మొదలైందని తెలిపారు. మోదీ వెళ్తే సీఏఏ కూడా వెళ్తుందని కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఏఏను ఎవరూ తొలగించలేరని మోదీ స్పష్టం చేశారు.