బీజేపీ, బీఆర్ఎస్లపై కాంగ్రెస్ కడియం శ్రీహరి విమర్శలు చేశారు. కమలం పార్టీ సీబీఐ, ఈడీ వ్యవస్థలను ఉపయోగించుకోని నేతల్ని లొంగదీసుకోవాలని చూస్తోందని ఫైర్ అయ్యారు. బీజేపీలో చేరితే పూనీతులవుతారు.. కాంగ్రెస్లో చేరితే విమర్శలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీల్లో చేరిన నేతలను టార్గెట్ చేయని..గులాబీ నేతలు తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉండి స్టేషన్ఘనపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేనన్న ఆవేదన తనలో ఉందన్నారు. అందుకు కాంగ్రెస్లో చేరానన్నారు కడియం.