ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ వర్షం కురిసింది. ఒంగోలులో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమ య్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా ఒంగోలు డిపో ప్రాంతంలో రోడ్డుపై భారీగా బురదనీరు చేరుకోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వర్షం తగ్గిన తర్వాత మున్సిపల్ శాఖ అధికారులు, వర్కర్లు మురుగునీటిని కాలువల ద్వారా మళ్లించే ప్రయత్నం చేశారు.