బైజూ రవీంద్రన్‌కు 6 నెలల జైలు శిక్ష విధించిన సింగపూర్ కోర్టు

బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌కు సింగపూర్ కోర్టు జైలు శిక్ష విధించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2024 ఏప్రిల్ నుంచి ఆయన ఆస్తులకు సంబంధించిన పలు కోర్టు ఆదేశాలను పాటించలేదని సింగపూర్ కోర్టు తెలిపింది. బైజూ రవీంద్రన్ వెంటనే అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. సుమారు 90 వేల సింగపూర్ డాలర్లు జరిమానా చెల్లించాలని చెప్పింది. అలాగే Beeaar Investco Pte అనే సంస్థలో తన చట్టబద్ధ యాజమాన్యాన్ని నిరూపించే డాక్యుమెంట్లను సమర్పించాలని తెలిపింది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న బైజూస్‌కు ఇది మరో పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అమెరికాలో 1.2 బిలియన్ డాలర్ల రుణ వివాదంతో పాటు ప్రపంచవ్యాప్తంగా విదేశీ పెట్టుబడిదారులు సంస్థపై న్యాయపోరాటం కొనసాగిస్తున్నారు.

Latest Articles

తెలంగాణలో వడదెబ్బ బీభత్సం.. ఒక్కరోజే 45 మంది మృతి

తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. వడదెబ్బ కారణంగా నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 45 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. గత ఆరు రోజుల వ్యవధిలో మొత్తం 267 మంది వడదెబ్బకు గురై...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్