టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు భారీ కాంస్య విగ్రహం హైదరాబాద్లో కొలువుదీరింది. అమీర్పేటలోని మైత్రీవనం చౌరస్తాలో ఏర్పాటు చేసిన 23 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. సీఎం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చేదిశగా అడుగులు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తానని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. దీన్ని అమలు చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఎన్టీఆర్ విగ్రహాన్ని రేవంత్ ఆవిష్కరించనున్నారు. విగ్రహావిష్కరణ సభ నేపథ్యంలో మైత్రీవనం చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు.
మైత్రివనం దగ్గర ఎన్టీఆర్ విగ్రహం.. ఆవిష్కరించనున్న రేవంత్ రెడ్డి
0
7
Previous article
Latest Articles
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సిద్ధరామయ్య
సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కేబినెట్ను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం పదవికి సిద్ధరామయ్య...
- Advertisement -
- Advertisement -


