రాజ్యసభకు వెళ్లే ఆలోచన లేని సిద్ధరామయ్య

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రస్తుతం రాజ్యసభకు వెళ్లే ఆలోచన లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి డీకే శివకుమార్‌కు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సూచించింది. దీంతో ఆయన రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. దీనికి ప్రతిఫలంగా రాజ్యసభ సీటును ఆఫర్ చేసినప్పటికీ, సిద్ధరామయ్య మాత్రం రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగాలని భావిస్తున్నారట. సిద్ధరామయ్య ప్రస్తుతం వరుణ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. 2008లో ఏర్పడినప్పటి నుంచి ఇది ఆయన కుటుంబానికి బలమైన నియోజకవర్గంగా ఉంది. ఆయన తన ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసి, తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇది కాంగ్రెస్ పార్టీకి 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా అహిందా వర్గాలపై సిద్ధరామయ్యకు ఉన్న బలమైన ప్రభావం పార్టీకి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అహిందా అంటే వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలు కలిపిన ఓటు బ్యాంక్.

Latest Articles

12 ఏళ్లు అయినా అమరవీరులను గుర్తించలేకపోయారు- పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ యువత పట్ల గౌరవం ఉందని.. యువత బలిదానాలు తనను కదిలించాయన్నారు. 12 ఏళ్లు అయినా అమరవీరులను గుర్తించలేకపోయారని చెప్పారు. 1200...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్