ఈ రోజు సచివాలయంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలని కలవడం జరిగింది. ఈ సందర్భంగా సహకార సంఘాల పాలకవర్గ పదవీకాలం ఈ నెలలో ముగియనున్న నేపథ్యంలో, వారి పదవీకాలాన్ని పొడిగించాలని మంత్రిని విజ్ఞప్తి చేశారు. మంత్రి స్పందిస్తూ, ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పదవీకాల పొడగింపుకు కృషి చేస్తానన్నారు.
అలాగే, సీతారామ ఎత్తిపోతలు, సీతమ్మ సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ సమగ్ర ప్రాజెక్ట్ నివేదికకు (డిపిఆర్) సంబంధించిన సాంకేతిక అనుమతుల దస్త్రం ఈ రోజు సాంకేతిక సలహా కమిటీ ముందుకు వెళ్లనున్న నేపథ్యంలో, ఈ అంశంపై ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి, ఇరిగేషన్ అడ్వైజర్, ఇరిగేషన్ సీఈలను కలిసి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
మంత్రి తుమ్మలతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్లు భేటీ
Latest Articles
- Advertisement -