ఈవీఎం ఎమ్మెల్యేలు.. ప్రజలు ఓట్లు వేస్తే గెలవలేదు- ప్రసన్నకుమార్‌ రెడ్డి

నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రశాంతి రెడ్డి రేణిగుంటలో మెస్సుతో పాటు తట్టల వ్యాపారం చేశారేమోనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలతో ఎమ్మెల్యేలు అయ్యారని.. ప్రజలు ఓట్లు వేస్తే గెలిచినోళ్లు కారని ఆరోపించారు. రెండేళ్లలో తాము చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చెప్పుకోవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వంలో నిర్మించిన సచివాలయాల ముందు సభలు పెట్టి మాట్లాడుతూ అభివృద్ధి చేయలేదని మాట్లాడడం మంచిది పద్దతి కాదన్నారు. ప్రశాంతమైన కోవూరు నియోజకవర్గంలో కొంతమంది టిడిపి నాయకులు రౌడీయిజంకి తెర లేపుతున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసినందుకు దామరమడుగు గ్రామానికి చెందిన వంశీ పై మండల పార్టీ అధ్యక్షుడు అడ్డగించి దాడి చేశారని ఆరోపించారు. రౌడీయిజం తాము కూడా చేయగలుగుతాం కానీ అది మంచిది కాదన్నారు. రౌడీయిజం చేస్తున్న నాయకులపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Latest Articles

దిల్‌సుఖ్‌నగర్‌ రోడ్డుపై రేవంత్‌రెడ్డి పేరుతో ఓవర్‌స్పీడ్‌తో కారు హల్‌చల్‌

హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్ నగర్ రోడ్లపై తెలంగాణ టైగర్ పేరుతో ఓవర్ స్పీడ్‌తో  ఓ కారు హల్‌చల్‌ చేసింది. కారు నెంబర్ ప్లేట్ స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉంది. కారు వెనుక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్