నిర్మల్ జిల్లా బైంసాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై జరిగిన దాడి కేసులో 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ నిర్మల్ జిల్లా భైంసాలో ప్రచారం చేస్తుండగా కొంతమంది హనుమాన్ భక్తులు ఆయనపై ఉల్లిగడ్డలు, టమాటాలుతో దాడి చేసారు. ఈ క్రమంలో కాసేపు ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఓ పక్క దాడి చేస్తున్న పోలీసులు పట్టించు కోకుండా ఉండడంఫై ఆగ్రహం వ్యక్తం చేసారు కేటీఆర్ఆ తర్వాత పోలీసులు వారిని అక్కడి నుండి పంపించారు. కేటీఆర్ పై టమాటాలతో విసిరిన 23 మంది హనుమాన్ దీక్షాపరులను పోలీసులు అరెస్టు చేశారు.