Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

సమస్యలను పక్కకు నెట్టి, భావోద్వేగాలను రెచ్చగొడుతున్న బీజేపీ

   ఏ పార్టీ అయినా ఎన్నికల సమయంలో ఓట్లు అడగటానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీ అయితే గత ఐదేళ్ల కాలంలో ప్రజలకు తాము చేసిన మంచి పనులను వివరించాలి. ఈ ఐదేళ్ల కాలంలో ఎన్ని మహత్తర విజయాలు సాధించాం. మరోసారి అవకాశం ఇస్తే మరిన్ని ప్రజోపయోగమైన పనులు చేస్తామని జబ్బలు చరుచుకుని చెప్పగలగాలి. అలాగే ప్రతిపక్షాలైతే గత ఐదేళ్ల కాలంలో పాలకవర్గం వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. తాము అధికారంలోకి వస్తే చేయబోయే పనులను ప్రజలకు వివరించగలగాలి. అధికారంలో ఉన్న పార్టీకి భిన్నంగా తాము చేపట్ట బోయే విధానాలను ప్రజలకు వివరించాలి. అందుకు అనుగుణంగా ప్రజల మద్దతు కూడగట్టుకోగలగాలి. అయితే ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు గాలికి పోతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు యధాలాపంగా అన్న మాటలను హైలెట్ చేసి, ప్రజలను మభ్యపెట్టి ఓట్లు రాబట్టుకోవడమే పనిగా పెట్టుకుంటున్నాయి పాలకవర్గాలు. ఇక ప్రస్తుత ఎన్నికల పరిస్థితిని విశ్లేషిస్తే, లోక్‌సభ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ ధీమా సడలుతోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటి, రెండో, అలాగే మూడో విడత పోలింగ్ తరువాత పరిస్థితి ఆశాజనకంగా లేదన్న సంగతి బీజేపీ అగ్రనాయకులకు తెలిసిపోయింది. దీంతో ఒక్కసారిగా ప్రధాని నరేంద్ర మోడీ స్వరం మారిపోయింది.

  నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉంది. అయితే ఈ పదేళ్లపాలనలో ప్రజలకు తమ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పలేకపోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చింది. తొలి ఐదేళ్ల కాలంలో నరేంద్ర మోడీ సర్కార్ ప్రజలు గుర్తుపెట్టుకునేంతటి ఘన కార్యా లు ఏమీ లేవంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో 2019 లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి.2019 లోక్‌సభ ఎన్నికల ముందు పుల్వామా సంఘటన జరిగింది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం వెంటనే సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది. సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలు భారత సైన్యానికి జై కొట్టారు. దీంతో ఎన్డీయే కూటమి మరో సారి కేంద్రంలో పాగా వేయగలిగింది. మొత్తంగా పదేళ్ల పాటు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంచెలాయించింది. అయితే 2024 నాటికి జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితులు మారిపో యాయి. కాంగ్రెస్ కుంభ కోణాలు చేసిందని ఆరోపించడానికి ఆ పార్టీ అధికారంలో లేదు. సరిహద్దుల్లో ఎటువంటి చొరబాటు సంఘటనలు లేవు. దీంతో సర్జికల్ స్ట్రైక్స్ కూడా లేవు. అయితే అయోధ్య అంశం లోక్‌సభ ఎన్నికల్లో తమకు కలిసివస్తుందని కమలనాథు లు మొదట్లో భావించారు. అయితే ఎన్నికలు ప్రారంభం అయ్యేనాటికి బాలరాముడి ప్రతిష్టాపన అంశం సృష్టించిన వేడి చల్లారింది.

  నరేంద్ర మోడీ సర్కార్ వచ్చిన కొత్తల్లో పెద్ద నోట్లను రద్దు చేసింది. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని దేశాని కి తీసుకురావడానికే పెద్దనోట్లు రద్దు చేసినట్లు అప్పట్లో నరేంద్ర మోడీ వెల్లడించారు. అలా విదేశీ బ్యాంకుల నుంచి తీసుకువచ్చిన సొమ్ములను ప్రజలకు ఒక్కొక్కరికి లక్షల రూపాయల వంతున చెల్లిస్తామన్నారు నరేంద్ర మోడీ. అయితే పెద్ద నోట్లు రద్దయి సంవత్సరాలు గడిచాయి. ఇప్పటివరకు ఎన్ని వందలు లేదా వేల కోట్ల రూపాయల మేరకు నల్లధనం మనదేశానికి తీసుకువచ్చారో నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పలేకపోయింది. దాదాపు మూడేళ్ల కిందట మూడు వ్యవసాయ చట్టాలను రూపొందించింది నరేంద్ర మోడీ సర్కార్‌. ఈ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించారు దేశవ్యాప్తంగా రైతులు. ఢిల్లీ శివార్లలో దాదాపు ఏడాది పాటు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిం చారు. పంటకు మద్దతు ధర ఇవ్వడానికి చట్టం చేయాలన్నది అన్నదాతల ప్రధాన డిమాండ్. అయితే ఈ డిమాండ్‌ను ఇప్పటివరకు అమలు చేయలేకపోయింది నరేంద్ర మోడీ. దీంతో అన్నదాతలు ఇప్పటికీ నరేంద్ర మోడీ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మొత్తంగా పదేళ్ల పాటు ప్రధానిగా పనిచేసిన నరేంద్ర మోడీ. ప్రజలకు తాము ఇది చేశామని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క అంశం కూడా లేకుండా పోయింది.

  చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో ప్రతిపక్షాలపై రాళ్లేయడమే పనిగా నరేంద్ర మోడీ పెట్టుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమాజంలో మతపరమైన విద్వేషం రగిల్చి ఎన్నికల్లో విజయం సాధించ డమే కమలం పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని మేధావులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే మొదటి విడత పోలింగ్ ముగిసిన వెంటనే రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలపై విషం చిమ్మేలా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపదను హోల్‌ సేల్‌గా ముస్లింలకు దోచిపెడుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో వివాదం మొదలైంది. ముస్లిం మైనారిటీలపై నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.ప్రధాని హోదాలో ఉన్న నరేంద్ర మోడీ. అతి పెద్ద అల్పసంఖ్యాకవర్గాన్ని కించపరుస్తూ కామెంట్స్ చేయడం ఎంతవరకు సబబు అనే ప్రశ్న తెరమీదకు వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ తీరును మేధావులు, ప్రజాస్వామ్య ప్రియులు తప్పు పట్టారు.

   వివాదం మరింత పెద్దదైతే, చివరకు పార్టీ ప్రయోజనాలు దెబ్బతింటాయని బీజేపీ అగ్రనేతలు గ్రహిం చారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ వెనక్కి తగ్గారు. దేశ జనాభాలో 14 శాతానికి పైగా ఉన్న ముస్లిం మైనారి టీలను సముదాయించ డానికి ప్రయత్నించారు. ముస్లింలకు తాను ఎంతమాత్రం వ్యతిరేకం కానంటూ వివరణ ఇచ్చారు నరేంద్ర మోడీ. ముస్లిం మైనారిటీల అభ్యున్నతి పట్ల తనకు చిత్తశుద్ది ఉందన్నారు. దీనికి ఉదాహరణ. ట్రిపుల్ తలాక్‌ను తమ ప్రభుత్వం రద్దు చేయడమే అంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే హిందూ ఓట్‌బ్యాంక్‌ను పోలరైజ్ చేయడానికి వీలుగా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్రమంత్రి అమిత్ షా ఇప్పటికే అనేకసార్లు కుండబద్దలు కొట్టారు.మొత్తంమీద ఎన్నికల సమయంలో అసలు సమస్యలు పక్కన పడుతున్నాయి. భావోద్వేగాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలే తెరమీదకు వస్తున్నాయి.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్