యువకుడుని కత్తితో పొడిచి, కూతురిని తండ్రి బలవంతంగా లాక్కెళ్ళిన ఘటన ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం సీతారామపురంలో జరిగింది. కందుల వంశీ, అత్తి శ్రావణి ప్రేమ పెళ్లి చేసుకోవడంతో ఆమె తండ్రి, కొందరు కులపెద్దలు కత్తులు, కర్రలతో దాడి చేసి, ఈ దారుణానికి పాల్పడ్డారు. కత్తిపోట్లకు గురైన వంశీ, తల్లి నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆగిరిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.