ఏపిలో నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదని మండిపడ్డారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఉద్యోగాలు లేక యువత చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని జగన్ హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా dsc అని దగా డీఎస్సీగా చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వం DSC వేయకపోతే నీతులు చెప్పిన జగన్..ఇప్పుడు ప్రతిపక్షాలకు కనీసం ప్రశ్నించే హక్కు లేకుండా చేశారని షర్మిల ఫైర్ అయ్యారు.