కడప జిల్లా కమలాపురం మండలం రామాపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథశర్మపై టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఉత్తా నరసింహారెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. కొంత కాలంగా సాయినాథ శర్మ టీడీపీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా పెద్ద చెప్పలి గ్రామంలో అత్మీయ సమావేశం ఏర్పాటు చేసి, వైసీపీలో చేరేందుకు సాయినాథశర్మ అనుచరులు ప్రయత్నాలు చేస్తున్నారు. అత్మీయ సమావేశాన్ని అడ్డుకునేందుకు సాయినాథశర్మ అనుచరులను ఉత్తా నరసింహారెడ్డి అనుచరులు తీసుకెళ్లారు. కాగా… తన అనుచరులను పరామర్శించేందుకు పెద్దచెప్పలి వెళ్లిన సాయినాథ్ శర్మపై ఉత్తా అనుచరులు దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తవాతావరణం నెలకొంది.
కడప జిల్లా రామాపురంలో ఉద్రిక్తత
0
396
Previous article
Next article
Latest Articles
అశాంతిగా విజయశాంతి
ఆమె సినీ రంగంలో లేడీ సూపర్ స్టార్. ఆ తర్వాత రాజకీయ రంగంలోను రాణించారు. ఎంపీగా పని చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. కానీ రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. ఫైర్ బ్రాండ్...
- Advertisement -
- Advertisement -


