స్వతంత్ర, వెబ్ డెస్క్: పోలీసు నియామక తుది రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో 84శాతం అర్హత సాధించినట్లు పోలీసు నియామక బోర్డు వెల్లడించింది. ఈ మేరకు సివిల్, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల ఫలితాలు విడుదల చేసింది. సివిల్, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు 98,218 మంది అర్హత.. ఐటీ &కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులకు 4,564మందికి అర్హత సాధించినట్లు తెలిపింది.
సివిల్ ఎస్ఐ పోస్టులకు 43,708 మంది అభ్యర్థులు, ఐటీ & కమ్యుూనికేషన్ ఎస్ఐ పోస్టులకు 729 మంది అభ్యర్థులు.. డ్రైవర్, ఆపరేట్ కానిస్టేబుల్ పోస్టులకు 1779 మంది అభ్యర్థులు, ఫింగర్ప్రింట్ బ్యూరో ఏఎస్ఐ పోస్టులకు 1,153 మంది అభ్యర్థులు.. పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఎస్ఐ పోస్టులకు 463 మంది అభ్యర్థులు.. కానిస్టేబుల్ మెకానిక్ పోస్టులకు 238 మందికి అర్హత సాధించినట్లు తెలిపింది. అభ్యర్థుల మార్కులు రాత్రి నుంచి వెబ్సైట్లో ఉంటాయని పేర్కొంది. ఫైనల్ కీ, ఓఎంఆర్ షీట్లు వెబ్సైట్లో చూసుకోవచ్చు.