Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

ఏపీలో వైసీపీ గెలుపుపై కేసీఆర్ ఆసక్తికి కారణం ఏమిటి?

ఏపీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టీ నెలకొంది. జూన్ నాలుగున రానున్న ఫలితాల్లో గెలిచేదెవరు అన్నదానిపై ఎవరి అంచనాలు వారివే. అయితే..వచ్చేది ఆయన కాదు.. ఈయనే అంటున్నారు గులాబీ పార్టీ నేతలు. పైగా ఈయనే రావాలని కోరుకుంటున్నారు కూడా. ఇంతకీ ఆయనెవరు.. ఈయనెవరు..? కారు పార్టీ నేతలు ఈయనే ఎందుకు పవర్ లోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు..?

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఫలితాలపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 81 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావడంతో జూన్ నాలుగున వచ్చే రిజల్ట్స్‌ ఎలా ఉంటాయన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏపీ సీఎం జగన్ పథకాలు మెచ్చిపెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు తరలి రావడం తమకే లాభిస్తుందని వైసీపీ నమ్మకంగా చెబుతోంది. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత భారీగా ఉండడం వల్లే ఇంత శాతం ఓటింగ్ నమోదైందని.. అది కూటమికే ప్లస్ పాయింట్ అవుతుందని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అంటున్నారు.ఇదంతా బాగానే ఉన్నా.. ఏపీ అసెంబ్లీ ఫలితాలపై తెలంగాణలోనూ జోరుగా చర్చ సాగుతోంది. ఎలక్షన్ రిజల్ట్స్ ఏ పార్టీకి అనుకూలం, ఏ పార్టీకి ప్రతికూలం అనే చర్చ ఇక్కడి ప్రజల్లోనే కాదు.. రాజకీయ నాయకుల్లోనూ హాట్‌టాపిక్‌గా మారింది. అయితే.. ఇతర పార్టీల సంగతి కాస్త పక్కన పెడితే బీఆర్ఎస్ మాత్రం వైసీపీయే మళ్లీ అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటోంది. అందుకు తగినట్లుగానే ఎన్నికల ప్రచారంలోనూ, పోలింగ్ తర్వాత కూడా గులాబీ పార్టీ నేతలు జగన్ పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఏపీలో వైసీపీయే అధికారంలోకి వస్తుందన్న కామెంట్లు చేశారు. ఇదే అంశంపై తమకు వివిధ వర్గాల ద్వారా సమాచారం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఏపీలో వైసీపీ రావాలని బీఆర్ఎస్ కోరుకోవడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి కూడా. రాజకీయాల్లో శతృవుకు, శతృవు మిత్రుడన్న సామెత ఇక్కడ ప్రస్తావనకు వస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రులుగా అయ్యారు. అయితే.. అప్పటికే కొంత బేధాలు ఉన్నా.. పక్కన పెట్టి మరీ ఇద్దరూ ముందుకు సాగారు. కానీ, ఆ తర్వాత ఓటుకు నోటు కేసుతో ఇద్దరు సీఎంల మధ్యా బేధాభిప్రాయాలు వచ్చాయి. సవాళ్లు, ప్రతిసవాళ్ల వరకు వ్యవహారం వెళ్లింది. ఈ క్రమంలోనే 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి.

సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళ్లడంతో 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ సమయంలో కేసీఆర్‌ను ఓడించేందుకు చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు. ఓ అవగాహనతో ముందుకెళ్లారు. కానీ, ప్రజలు మాత్రం మరోసారి గులాబీ పార్టీనే గెలిపించారు. దీంతో.. కేసీఆర్ అప్పట్లోనే చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు. అన్నట్లుగానే 2019 ఏపీ ఎన్నికల్లో నాటి ప్రతిపక్ష నేత వై.ఎస్ జగన్‌కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించారన్న ప్రచారం జోరుగా సాగింది. కారణమేదైనా 151 సీట్లతో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో.. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్లైంది. ఇక, అప్పటి నుంచి ఏపీ, తెలంగాణ మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగాయి.

పాలిటిక్స్‌లో కేసీఆర్‌ను పెద్దన్నగా భావించారు జగన్. అందుకు తగినట్లుగానే వివిధ అంశాల్లో సలహాలు సూచనలు పాటించేవారన్న అభిప్రాయమూ విన్పించింది. అయితే.. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓటమి పాలై ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. దీంతో.. తెలంగాణలో కొంత క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది కారు పార్టీ అధినాయకత్వం. ఓవైపు అధికారం పోవడం, మరోవైపు నేతల వలసలతో ఇబ్బందులు పడుతోంది. పైగా సీఎం రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్‌ నుంచి ఎదురుదాడి రోజురోజుకూ పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తే అక్కడ చంద్రబాబు సీఎంగా అవుతారు. అలాంటప్పుడు ఇటు రేవంత్, అటు చంద్రబాబుతో రాజకీయంగా మరింత క్లిష్టపరిస్థితులను బీఆర్ఎస్ ఎదుర్కోవాల్సి ఉంటుందన్న అంచనాలు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో బలంగా విన్పిస్తున్నాయి. దీంతో.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గులాబీ పార్టీ నేతలు కూటమి కంటే.. ఏపీలో జగన్ రావాలని బలంగా కోరుకుంటున్నారన్న వాదన విన్పిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కోరుకుంటున్నట్లుగా ఏపీ సీఎంగా జగన్ మళ్లీ అధికారం చేపడితే.. ఇక్కడ గులాబీ పార్టీకి కాస్త సానుకూల పరిస్థితి ఉంటుందున్న అంచనాలున్నాయి. జగన్ పవర్‌లోకి వస్తే.. ఏపీ సర్కారు అండతో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం సులువవుతుందన్న అభిప్రాయం నెలకొంది. ఇలాంటి వ్యూహాలతోనే ఏపీలో మరోసారి వైసీపీ రావాలని బీఆర్ఎస్ బలంగా కోరుకుంటోందన్న వాదన విన్పిస్తోంది. మరి.. గులాబీ పార్టీ నేతల ఆకాంక్ష నెరవేరుతుందా ? లేదంటే ప్రతికూల ఫలితం వస్తుందా అన్నది జూన్ నాలుగున తేలనుంది.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్