Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

మహానాడు వాయిదాలో మతలబు ఏమిటి?

పసుపు పండుగ వాయిదా పడింది. జూన్ నాలుగున ఏపీ అసెంబ్లీతోపాటు పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ ఉండడంతో కొద్ది రోజుల పాటు మహానాడును వాయిదా వేయాలని నిర్ణయించింది తెలుగుదేశం పార్టీ. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత ఆలోచనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ కార్యక్రమాన్ని వాయిదా వేయకుండా ఉంటే బాగుండేదని కొందరు అంటుంటే.. కొద్ది రోజులు ఆగి నిర్వహించడమే సరైనదని అంటున్నారు మరికొందరు. ఇలా వేర్వేరు అభిప్రాయాలు ఎన్నికల ఫలితాల ముంగిట వ్యక్తమవడానికి కారణమేంటి ?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ చివరి స్టేజీకి వచ్చేసింది. జూన్ ఒకటిన ఆఖరి దశ పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత మూడు రోజులకు అంటే జూన్ నాలుగున ఫలితాలు వెలువడనున్నాయి. అప్పుడే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు సైతం రానున్నాయి. దీంతో.. ఏపీలో అధికారం చేపట్టబోయేది ఎవరు.. ప్రతిపక్ష పాత్రకు పరిమితమయ్యేది ఏ పార్టీ అన్నది తేలనుంది.

వాస్తవానికి తెలుగు దేశం పార్టీ ప్రతి ఏటా మహానాడును ఘనంగా నిర్వహిస్తూ వస్తుంటుంది. ఆంధ్రుల అభిమాన నేత, టీడీపీ వ్యవస్థాపకుడైన సీనియర్ ఎన్టీఆర్ జయంతి మే 28. దీంతో.. ప్రతి ఏటా ఆయన జయంతి కలిసి వచ్చేలా పార్టీ పండుగను మహానాడు పేరుతో నిర్వహిస్తున్నారు. మొదటగా ఎన్టీఆర్‌ను స్మరించుకోవడం ద్వారా కార్యక్రమాన్ని మొదలు పెట్టి ఆ తర్వాత… పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి.. ఆ సంవత్సరం ఎలాంటి కార్యక్రమాల ద్వారా ముందుకెళ్లాలన్న దానిపై నేతలు అంతా చర్చిస్తారు. చివరకు తీర్మానాలు చేసి ఆమోదిస్తారు. వాటి ప్రకారం పార్టీ భవిష్యత్ కార్యాచరణ చేపడతారు. టీడీపీ అధికారంలో ఉన్నా, లేకున్నా ఇదే పద్దతి సాధారణంగా పాటిస్తుంటారు. తెలుగుదేశం పార్టీ పరంగా చూస్తే పసుపు పండుగగా అభివర్ణించే మహానాడుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అయితే..కొన్నిసార్లు మాత్రం మహానాడును నిర్వహించలేకపోయారు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ప్రభుత్వమే ఏపీలో ఏర్పడింది. కానీ, మే 16న ఫలితాలు రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సమయం చాలదని మహానాడును జరపలేదు. ఆ తర్వాత 2019 ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడ్డాయి. అప్పుడు టీడీపీ ఘోర పరాజయం పాలవడంతో మహానాడును ఆ ఏడాది నిర్వహించకుండా రద్దు చేశారు. ఇక, ప్రపంచాన్ని వణికించిన కరోనా కారణంగా రెండేళ్లపాటు పసుపు పండుగ జరపలేదు.

2022లో మళ్లీ ప్రకాశం జిల్లాలో మహానాడు నిర్వహించారు. 2019 పరాజయం తర్వాత నిస్తేజంగా, నిశ్శబ్దంగా ఉన్న టీడీపీ శ్రేణులు అప్పటి నుంచి యాక్టివ్ అయ్యాయన్న ప్రచారం సాగింది. ఆ తర్వాత 2023లో తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో నిర్వహించారు. ఇక, 2024 విషయానికి వస్తే మే 13న ఎన్నికలు నిర్వహించగా.. జూన్ నాలుగున ఫలితాలు రాబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా మహానాడు జరపడం సరికాదన్న అభిప్రాయానికి వచ్చింది టీడీపీ అధిష్టానం. అందుకు బదులుగా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా గ్రామ గ్రామాన పార్టీ జెండాలు ఎగురవేయడం, రక్తదానం, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు పార్టీ అధినేత.

ఎన్నికల ఫలితాల ముంగిట టీడీపీ అధిష్టానం ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై అంతర్గతంగా పార్టీ నేతల్లోనే చర్చ సాగుతోంది. కొందరు మహానాడును వాయిదా వేయడాన్ని సమర్థిస్తుంటే.. మరికొందరు మాత్రం అలా ఎందుకు చేశారు.. దాని వెనుకున్న కారణాలేంటి అన్న ఆలోచన చేస్తున్నారు. అయితే.. మరికొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు వస్తాయనగా టీడీపీ అధినేత తీసుకున్న నిర్ణయానికి గల కారణాలను ఓసారి విశ్లేషిస్తే.. మహానాడు నిర్వహణకు, ఎన్నికల ఫలితాలకు మధ్య పెద్ద గ్యాప్ లేదు. పైగా ఓవైపు చాలా ప్రాంతాల్లో పోటాపోటీగా పోలింగ్ జరిగిందన్న సమాచారం పార్టీకి చేరింది. ఓవైపు పార్టీ కేడర్‌ను ఉత్సాహపరిచేందుకు పైకి అధికారంలోకి వచ్చేది మేమేనని.. అది కూడా 130 నుంచి 150 సీట్లు సాధిస్తామని పసుపు శ్రేణులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో తేడా అంత ఉండకపోవచ్చన్న సమాచారం పార్టీ అధినేతకు చేరినట్లు తెలుస్తోంది. ఎవరు గెలిచినా స్వల్ప తేడానే ఉండొచ్చన్న అంచనాలు ఉండడంతో ఒక వేళ మహానాడు జరిపినా.. ఆ వేదికగా నేతల ప్రసంగాలు, ఉత్సాహాలు వేరేగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ మాత్రం ఫలితాల్లో తేడా కొట్టినా ఎన్నో విమర్శలు వెల్లువెత్తడం ఖాయమన్న చర్చ పార్టీ అధినేత సమక్షంలోనే నేతల మధ్య ప్రస్తావనకు వచ్చినట్లుగా సమాచారం. దీంతో.. ఏ వేడుక చేసినా రిజల్ట్స్ వచ్చిన తర్వాత అయితేనే మంచిదన్న అభిప్రాయం మెజార్టీ వర్గాల్లో వ్యక్తమవడంతోనే చివరకు వాయిదాకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

ఓవైపు అధికారంలోకి వచ్చేది మేమేనని చెబుతూనే.. ఇలాంటి పరిస్థితుల్లో మహానాడు వాయిదా వేయడం ద్వారా పార్టీ నేతల్లోనే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా నెగెటివ్ సంకేతాలు వెళతాయని మరికొందరు అభిప్రాయపడుతన్నారు. ఓవైపు వైసీపీ అధినేత మొదటి నుంచీ వైనాట్ 175 అనే నినాదం విన్పిస్తున్నారు. పైగా.. పోలింగ్ పోటా పోటీగా జరిగిందన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో.. జగన్ ఇటీవలె ఐ ప్యాక్ టీమ్ దగ్గరకు వెళ్లిన సమయంలో 2019 ఎన్నికల కంటే ఎక్కువ అసెంబ్లీ సీట్లు, ఎంపీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాంటప్పుడు మహానాడు నిర్వహించి ఆ వేదికగా పార్టీ విజయావకాశాలపై ఓ అభిప్రాయం చెప్పినంత మాత్రన పోయేదేమీ లేదన్నది మరికొందరు చెప్పేమాట. మొత్తంగా ఎలా చూసినా నేతల అభిప్రాయాలన్నీ సావధానంగా విని, ఆలోచించి మహానాడు వాయిదాకు మొగ్గు చూపారు టీడీపీ అధినేత చంద్రబాబు. దీంతో.. రాబోయే రోజుల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి తెలుగు రాష్ట్రాల్లో మరింత పెరిగింది.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్