31.2 C
Hyderabad
Thursday, September 28, 2023

ఉసేన్ బోల్ట్ ఖాతా నుంచి రూ.103 కోట్లు మాయం

  • ఆర్థిక మోసానికి పాల్పడిన ఎస్‌ అండ్ ఎస్‌ సంస్థ మాజీ ఉద్యోగి
  • సొమ్మును తిరిగి జమచేయాలని ఉసేన్ బోల్ట్ న్యాయవాదులు డిమాండ్‌

జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్‌కు షాక్ తగిలింది. ఆయన ఖాతా నుంచి ఏకంగా నూట మూడు కోట్ల రూపాయల నగదు మాయమైంది. జమైకాకు చెందిన స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ సంస్థలో ఉసేన్ బోల్ట్ ఈ సొమ్మును దాచాడు. అయితే, స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి ఒకరు.. ఆర్థిక మోసానికి పాల్పడినట్లు సమాచారం. కాగా, పదిరోజుల్లోగా మాయమైన సొమ్మును తిరిగి ఉసేన్ బోల్ట్ అకౌంట్‌లో జమ చేయాలని ఆ కంపెనీ యాజమాన్యాన్ని బోల్ట్‌ తరపు న్యాయవాదులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఉసేన్ బోల్ట్ అకౌంట్ నుంచి సొమ్ములు మాయం అయిన సంఘటనపై జమైకా ఆర్థిక మంత్రి నిగెల్ క్లార్క్‌ స్పందించారు. ఆర్థిక మోసానికి పాల్పడిన కంపెనీ మాజీ ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Latest Articles

చంద్రబాబుకు షాక్.. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కేవియట్ పిటిషన్

స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఆయన కస్టడీ, బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై కోర్టుల్లో విచారణ సాగుతోంది. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
288FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్