బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కేసీఆర్ కుటుంబం నుంచి మరికొందరు జైలుకు వెళ్తారని అన్నారు. ఎమ్మెల్యే హరీశ్రావు గేటుపై నిల్చున్నాడని.. ఆయన కాంగ్రెస్లోకి వెళ్తారా?.. లేక బీఆర్ఎస్లోనే ఉంటారా.. అనుమానమేనని అన్నారు. కేసీఆర్ అంటే కాళేశ్వర రావు అంటారు కానీ నంగునూర్లోని ఒక్క చెరువులో నీళ్ళు లేవని విమర్శించారు. రఘునందన్ రావు దుబ్బాకలో ఓడిపోవడం ఎంత నిజమో కామారెడ్డిలో కేసీఆర్ను బీజేపీ వాళ్లు ఓడించింది అంతే నిజమన్నారు. తెలంగాణలో ఆడపిల్లలు లిక్కర్ దందా నడపరన్నారు. మరికొద్ది రోజుల్లో కేసీఆర్ ఇంట్లో వాళ్ళు జైలుకు వెళ్లక తప్పదంటూ హెచ్చరించారు. కవితను తీహార్ జైలు నుంచి బయటకు తెచ్చే ఎన్నికలు కావని స్పష్టం చేశారు.