కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పూణె కోర్టు సమన్లు జారీ చేసింది. గతేడాది లండన్లో స్వాతంత్ర్య సమర యోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మనవడు సత్యకి సావర్కర్ గతంలో పూణెలోని ఓ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. దీనికి ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. కాగా.. ఈ కేసు గత నెలలో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ అయ్యింది. దీనిపై నిన్న విచారణ జరిపిన కోర్టు అక్టోబర్ 23న తన ముందు హాజరుకావాలని రాహుల్కి సమన్లు జారీ చేసింది.
రాహుల్ గాంధీకి పూణె కోర్టు సమన్లు
0
381
Previous article
Next article
Latest Articles
సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ వ్యాపారిని అరెస్టు చేసిన కొచ్చి పోలీసులు
సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ వ్యాపారిని కొచ్చి పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. 24 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో ప్రధాన నిందితుడు హైదరాబాద్కు చెందిన వ్యాపారి అల్లంరాజు...
- Advertisement -
- Advertisement -


