లోక్సభ ఎన్నికల్లో ఓవైపు కాంగ్రెస్ విధ్వంస మోడల్కు మరోవైపు మోదీ గ్యారంటీలకు మధ్య పోరాటంలో జరుగుతోం దని ప్రధాని మోదీ అన్నారు. ప్రజలు ఏ పక్షం వహిస్తారో తేల్చుకోవాలని కోరారు. అధికారం కోసం కాంగ్రెస్ అదేపనిగా అసత్యాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. అధికారం కోసం పూటకో మాట చెప్పే కాంగ్రెస్ను విశ్వసించవద్దని కోరారు. అగ్రకులాల్లోనూ పేదలు ఉంటారని, వారికీ రిజర్వేషన్లు అవసరమని కాంగ్రెస్కు 60 ఏళ్లుగా తెలియలేదని దుయ్యబట్టారు.