లోక్సభ ఎన్నికల వేళ ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి వ్యవహారం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ నెల 13వ తేదీన సీఎం నివాసంలో కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయ కుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశాడని స్వాతి మలివాల్ ఆరోపణలు రాజకీయంగా సంచలన మైంది. ఈ వ్యవహారంతో రాజ్యసభ పదవిని వదులుకోవాలంటూ స్వాతిపై ఒత్తిడి పెరుగుతు న్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో స్వాతి మలివాల్ స్పందించా రు. తాను ఎంపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా అభ్యర్థిస్తే పదవి నుంచి వైదొలగేదా న్నన్నారు. అలా కాకుండా దాడి చేయడంతో ఇప్పుడు పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు.