విజయవాడలో సీఎం జగన్పై జరిగిన దాడిని మంత్రి ఉషశ్రీ చరణ్ తీవ్రంగా ఖండించారు. బస్సుయాత్ర కు వస్తున్న ఆదరణను చూసి, యాత్రను ఆపాలనే ఉద్దేశంతో టీడీపీ దాడి జరిపిందన్నారు. మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ఇలాంటి దాడి చేయించడం పెద్ద పనేమి కాదని విమర్శించారు. రాష్ట్రంలోని వైసీపీ అబ్యర్థులపై దాడి జరిగే అవకాశం ఉందని… రాష్ట్రంలోని అభ్యర్థులంతా అప్రమత్తం గా ఉండాలని సూచించారు. ఇలాంటి దాడులు చేయించే వారిపై ప్రజలు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పలన్నారు.