28 C
Hyderabad
Saturday, June 28, 2025
spot_img

‘ఖుషి’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్..

స్వతంత్ర వెబ్ డెస్క్: డాషింగ్ హీరో ది విజయ్ దేవరకొండ .. సమంత కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. ఇప్పటికే ఈ సినిమా మీద ఓ హైప్ క్రియేట్ కాగా.. ఇప్పుడు సోషల్ మీడియాలో మరో అప్డేట్ చక్కర్లు కొడుతుంది. ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే అంటూ ప్రేమికులందరినీ కట్టిపడేసిన మేకర్స్.. ఇప్పుడు రెండో పాటను రిలీజ్ చేశారు. ఆరాధ్య అంటూ సాగే ఈ పాట ఇప్పుడు ప్రేమికుల గీతంగా నిలిచిపోయేలా ఉంది.

మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. ప్రేమకథా చిత్రాలను మంచి ఫీల్ తో తెరకెక్కించగలడనే పేరు శివ నిర్వాణకి ఉంది. తనదైన శైలిలో ఆయన రూపొందించిన ఈ సినిమా, సెప్టెంబర్ 1వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి సెకెండ్ సింగిల్ గా మరో సాంగును రిలీజ్ చేశారు. ‘పదమునీవైపిలా .. పరుగు నీవే కదా, తనువు తెరమీదుగా .. చేరుకో త్వరగా’ అంటూ ఈ పాట సాగుతోంది. హేషం అబ్దుల్ వాహెబ్ స్వరపరిచిన ఈ పాటకి శివ నిర్వాణ సాహిత్యాన్ని అందించగా, సిద్ శ్రీరామ్ – చిన్మయి ఆలపించారు. మరీ ముఖ్యంగా ఈ పాటలో శివ నిర్వాణ కొరియోగ్రఫీ అందరినీ ఆకట్టుకుంటుంది. బీట్ కొత్తగా ఉంది .. మంచి ఫీల్ వర్కౌట్ అయింది. సినిమాలో పాటకి తగిన విజువల్స్ పడితే, ఈ పాట బ్యూటీ మరింత పెరిగే అవకాశం ఉంది. సచిన్ ఖేడేకర్ .. జయరామ్ .. మురళీ శర్మ .. వెన్నెల కిశోర్ .. లక్ష్మి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమా హిట్ అటు విజయ్ దేవరకొండకి .. ఇటు సమంతకి చాలా అవసరమే.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్