తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై సమర్పించిన రాజీనామాను పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆమోదించినట్టు బీజేపీ ప్రకటించింది. ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సోషల్ మీడియా వేదికగా ప్రజలతో ఓపెన్ అండ్ హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కొన్ని గంటల ముందు ఆయన రాజనామా వార్త వెలువడడంతో ఆసక్తి నెలకొంది. ఆయన తదుపరి కార్యాచరణను ప్రకటించనున్నారు. రాజీనామాకు ముందు అన్నామలై ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ను కలిశారు. ఈ సందర్భంగా పార్టీతో ఉన్న అనుబంధాన్ని స్నేహపూర్వకంగా ముగించుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం అమిత్ షా, బీఎల్ సంతోష్ను కూడా కలిశారు. అయితే వారు వెంటనే నిర్ణయం తీసుకోవద్దని.. కొంత సమయం వేచి ఉండాలని చెప్పినట్టు సమాచారం.
అన్నామలై రాజీనామాకు బీజేపీ ఆమోదం
0
60
Previous article
Next article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


