చిరుత పులి కనిపిస్తే చాలు ఒక్కసారిగా ఒళ్లు గగుర్పొడుస్తోంది. అలాంటిది ఓ జర్నలిస్టు ఏకంగా చిరుతతో ఫైట్ చేశాడు. ఇలాంటి సీన్లు సినిమాల్లో మాత్రమే చూసి ఉంటాం..కానీ, రాజస్థాన్లో ఓ జర్నలిస్ట్ చిరుతతో పోరాడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాజస్థాన్లోని దుంగార్పుర్ భదర్ మెట్వాల గ్రామంలోకి చిరుత పులి రావటంతో ఆ చిరుతను జనాలు తరిమికొట్టేందుకు ప్రయత్నం చేశారు.అయితే, గ్రామస్తులు రాళ్లు రువ్వుతు చిరుత పులిని బెదిరించారు. ఇక, అక్కడే ఓ వార్తను కవరేజ్ చేసేందుకు వచ్చిన జర్నలిస్ట్ గున్వంత్ కలాల్పై చిరుత దాడి చేసేందుకు ప్రయత్నం చేసింది. అతడి కాలును నోటితో కరిచి పట్టుకోవడంతో అతడు ధైర్యంగా పోరాడి చిరుతను గట్టిగా పట్టేసుకున్నాడు. దాని దవడ, మెడను గట్టిగా పట్టుకుని.. ఆ తర్వాత చిరుత పులిని బంధించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.