టీటీడీ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీలో అక్రమాలు.. భూమన సంచలన ఆరోపణలు

టీటీడీలో 60 ఇంజనీరింగ్ పోస్టుల భర్తీలో భారీ అక్రమాలు జరిగాయని మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 27 ఏఈఈ, 10 ఏఈ, 19 ఏటీఓ, 4 జేఈ పోస్టుల భర్తీకి 2023 నవంబర్‌లో జగన్ ఆదేశాలతో నోటిఫికేషన్ ఇచ్చామని, 30 వేల మంది దరఖాస్తు చేశారని భూమన తెలిపారు. రాయలసీమకు ప్రత్యేక కేటాయింపులు లేక లీగల్ సమస్యలు వస్తాయని తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చైర్మన్ బీఆర్ నాయుడు ఈ ఏడాది మేలో అదే నోటిఫికేషన్ ఇచ్చారని, దీని వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. సెంటర్లు మార్చడంతో కేవలం 18 వేల మందే పరీక్షకు హాజరయ్యారన్నారు. చైర్మన్, ఇద్దరు సభ్యుల సహకారంతో ఒక్కో పోస్టు రూ.30 నుంచి 40 లక్షలకు అమ్ముకున్నారనే చర్చ జరుగుతోందని భూమన సంచలన ఆరోపణ చేశారు. రాష్ట్రాన్ని ఒకే జోన్‌గా చేసి రాయలసీమకు అన్యాయం చేశారని, 2024-25 బ్యాచ్‌కు అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. మద్రాస్ ఐఐటీతో పారదర్శకంగా చేద్దామనుకుంటే ఇప్పుడు డబ్బుల కోసం పోస్టులు అమ్ముతున్నారని విమర్శించారు.

Latest Articles

కొత్త ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే డీకేకు తలనొప్పులు

మూడు రోజుల కిందట కొలువుదీరిన కర్ణాటక ప్రభుత్వం అంతర్గత రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. మంత్రులలో ఒకరు ఇప్పటికే రాజీనామా చేయగా.. మరొక మంత్రి తనకు కేటాయించిన శాఖపై అసంతృప్తి వ్యక్తం చేశారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్