రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం కందివనంలో డిగ్రీ విద్యార్థి నవీన్ వినూత్న నిరసన చేపట్టాడు, గ్రామంలో పగలు రాత్రి తేడా లేకుండా మద్యం అమ్ముతున్న బెల్ట్ షాపులను వెంటనే మూసేయాలని గ్రామ కూడలిలో నిరసనకు దిగాడు. గ్రామంలోని యువకుల నుండి వృద్ధుల వరకు మద్యానికి బానిసై అనారోగ్యానికి గురవుతున్నారని నవీన్ ఆందోళన వ్యక్తం చేశాడు. బెల్ట్ షాపులు మూతపడే వరకు నిరసన కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. బెల్ట్ షాపులు మూసివేయాలంటూ నవీన్ చేపట్టిన ఆందోళనలో చిన్నారులు కూడా పాల్గొని ప్లకార్డులు ప్రదర్శించారు.