కర్నూలులో ముగ్గురు గుర్తుతెలియని మహిళల మృతి కలకలం రేపింది. కర్నూలు సమీపంలోని నగరవనం చెరువులో ఉన్న ఇద్దరి మహిళల మృతదేహాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ మృతదేహాలను వెలికి తీశారు. గుర్తుతెలియని మృతదేహాలుగా పోలీసులు కేసు నమోదు చేసి, శవపరీక్ష కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. కాసేపటికే చెరువు ఒడ్డుపై మరో మహిళ మృతదేహం కనిపించింది. ముగ్గురు మహిళలు చనిపోవడంతో వారిని ఎవరైనా హత్య చేశారా? లేక ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.


