ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ‘చెరువుకొమ్ముపాలెం’లో విషాదం చోటుచేసుకుంది. నీటికుంటలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. గల్లంతు అయిన చిన్నారులు ఇల్లా దినేష్(10), పొదిలి చిన్ను (11), కరేటి సుశాంత్ (12), కరేటి అభిరామ్ (14), గా గుర్తించారు. నీటికుంట ఒడ్డున చిన్నారుల దుస్తులు, చెప్పులు లభించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు, సహాయక సిబ్బంది చిన్నారుల కోసం గజఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.
ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు గల్లంతు
0
15
Previous article
Latest Articles
కాంగోలో ఎబోలా వైరస్ విజృంభణ… ఐసోలేషన్ కేంద్రాల నుంచి పరారైన 11 మంది
ఆఫ్రికా ఖండం కాంగోలో ఎబోలా వైరస్ విజృంభిస్తోంది. ఐసోలేషన్ కేంద్రాల నుంచి ఎబోలా సోకిన 11 మంది పరారవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఎబోలాతో మృతి చెందిన వారిని ఖననం చేసే బృందంపై కూడా...
- Advertisement -
- Advertisement -


