Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

అవగాహన కల్పించినా ఆగని సైబర్ క్రైమ్

    సైబర్‌ నేరగాళ్లు వివిధ రకాల పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట కోట్లు కొల్లగొడుతున్నారు. అందుకు సంబంధించిన ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ పెడితే ఎక్కువ లాభాలు పొందవచ్చని సైబర్ కేటుగాళ్లు వేసిన వలలో చిక్కి, భారీ మొత్తంలో మోసపోయారు నగరానికి చెందిన కొందరు అమాయకులు. తాము మోసపోయామని గమనించి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను కేరళలో అరెస్ట్ చేశారు పోలీసులు.

    సైబర్ క్రైమ్స్‌పై ఎంత అవగాహన కల్పించినా నిత్యం ఎవరో ఒకరు మోసపోతూనే ఉన్నారు. పెట్టుబడులు, అధిక లాభాల పేరుతో సైబర్ కేటుగాళ్లు వేసిన వలకు ఎంతో మంది అమాయకులు చిక్కి బలవుతున్నారు. తాజాగా ఇన్వెస్ట్‌మెంట్ పేరిట తొమ్మిది లక్షల 44వేల రూపాయలకు పైగా మోసపోయా నని, హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ పెడితే ఎక్కువ లాభాలు పొందవచ్చని సైబర్‌ నేరగాళ్లు, టెలిగ్రామ్‌లో బాధితుడికి మెసేజ్ చేశారు. ముందు నిందితులు బాధితుడి ఖాతాలో కొంత లాభాలు వేశారు. ఇది నమ్మిన బాధితుడు సొంత డబ్బులను భారీగా పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత బాధితుడి అకౌంట్ బ్లాక్ చేశారు నిందితులు. 9లక్షల 44వేలు మోసపోయానని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను కేరళలో అరెస్ట్ చేశారు.

   కేరళలో కొన్నిరోజుల పాటు క్యాంప్ వేసి మరీ నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు సైబర్ క్రైమ్ డీసీపీ కవిత. అమాయకులకు టెలిగ్రామ్ ద్వారా మెసేజ్‌లు పెట్టి మోసాలు చేస్తున్నారన్నారు. సైబర్ క్రైమ్ ద్వారా వచ్చే అమౌంట్‌ని రెంట్‌కి తీసుకున్న బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తున్నారన్నారు. ఆయా అకౌంట్స్ నుంచి దుబాయ్‌కి క్రిప్టో కరెన్సీ ద్వారా పంపిస్తున్నారని తెలిపారు. 18 అకౌంట్స్ ద్వారా 26 కోట్ల రూపాయల ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగినట్లు గుర్తించామన్నారు డీసీపీ.మరో కేసులో క్యాటరింగ్ సర్వీసెస్ బిజినెస్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న స్వామి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఓ వ్యక్తి రిసిప్షన్ ఫంక్షన్ కోసం 13 మంది క్యాటరింగ్ బాయ్స్‌ని తన దగ్గరికి రప్పించుకోని 7వేల రూపాయలకు మాట్లాడుకున్నాడు. అనంతరం ఫంక్షన్ అయ్యాక 15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అదనపు డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితుల నంబర్స్‌ను వివిధ వెబ్‌సైట్స్‌లో కాల్ గర్ల్స్ కావాలంటే ఈ నెంబర్‌కి కాల్స్ చేయాలంటూ పోస్ట్ చేశాడు. అంతే కాకుండా మెట్రో పిల్లర్స్, పబ్లిక్ టాయిలెట్స్‌పై రాశాడు. దీంతో బాధితులకు వందల కాల్స్ రావడంతో పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన చివరకు నిందితుడు స్వామిని అరెస్ట్ చేశామన్నారు. గతంలో ఇతనిపై 13 కేసులున్నాయని తెలిపారు డీసీపీ కవిత.దీంతో అన్‌ నోన్ లింక్‌లు, వెబ్‌ సైట్లు, వ్యక్తులను నమ్మకూడదని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్