మైనింగ్ అక్రమాలపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం

తెలంగాణలో మైనింగ్ అక్రమాల కేసులో సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, మహబూబాబాద్ జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. మొత్తం ఆరు ప్రాంతాల్లో సీఐడీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
మైనింగ్ కార్యకలాపాలు, అనుమతులు, లీజులు, రవాణా వివరాలపై ఆధారాలు సేకరిస్తున్నారు. ఆయా జిల్లాల మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్లు (ADలు) నుంచి కీలక సమాచారం తీసుకున్నారు. అక్రమ తవ్వకాలు, రాయల్టీ ఎగవేత, నిబంధనల ఉల్లంఘనలపై విచారణ కొనసాగుతోంది. గతంలో జారీ చేసిన అనుమతులు, రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. సంబంధిత పత్రాలు, డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నారు.

సోదాల్లో లభించిన వివరాల ఆధారంగా మరిన్ని అధికారులను విచారించే అవకాశం ఉంది. కేసుకు సంబంధించి సీఐడీ త్వరలో కీలక వివరాలు వెల్లడించే అవకాశముందని సమాచారం.

Latest Articles

టికెట్ విషయంలో వైసీపీ నాయకులు జగన్‌కు షరతులు పెడుతున్నారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంటే, మరోవైపు సొంత పార్టీ నేతల నుంచే అధిష్టానానికి అనూహ్యమైన షరతులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్