తెలంగాణలో మైనింగ్ అక్రమాల కేసులో సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్నగర్, మహబూబాబాద్ జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. మొత్తం ఆరు ప్రాంతాల్లో సీఐడీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
మైనింగ్ కార్యకలాపాలు, అనుమతులు, లీజులు, రవాణా వివరాలపై ఆధారాలు సేకరిస్తున్నారు. ఆయా జిల్లాల మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్లు (ADలు) నుంచి కీలక సమాచారం తీసుకున్నారు. అక్రమ తవ్వకాలు, రాయల్టీ ఎగవేత, నిబంధనల ఉల్లంఘనలపై విచారణ కొనసాగుతోంది. గతంలో జారీ చేసిన అనుమతులు, రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. సంబంధిత పత్రాలు, డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నారు.
సోదాల్లో లభించిన వివరాల ఆధారంగా మరిన్ని అధికారులను విచారించే అవకాశం ఉంది. కేసుకు సంబంధించి సీఐడీ త్వరలో కీలక వివరాలు వెల్లడించే అవకాశముందని సమాచారం.


