అయ్యో ఎంత కష్టం వచ్చింది.. ఎమ్మెల్యే టికెట్ల కోసం బీఆర్​ఎస్​ లీడర్ల ప్రదక్షిణలు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్​ ఆగస్టు 21న మధ్యాహ్నం బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్​ లిస్ట్​ విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో టిక్కెట్లు రావు అని ప్రచారం జరుగుతున్న పలువురు నేతలు పార్టీ ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఖానాపూర్ ​ఎమ్మెల్యే రేఖ నాయక్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హైదరాబాద్​లో ఉన్న మంత్రి హరీశ్​రావు, ఎమ్మెల్సీ కవిత నివాసాలకు వెళ్లారు.

తమకు బీఆర్​ఎస్ టికెట్​ కేటాయించాల్సిందిగా విన్నవిస్తూ.. సీఎం కేసీఆర్​ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మహిళా కమిషన్​ ఛైర్మన్​ సునీతా లక్ష్మారెడ్డి సైతం కవిత నివాసానికి వచ్చి టిక్కెట్ల వ్యవహారంపై చర్చించినట్లు సమాచారం. నర్సాపూర్​కి ప్రస్తుతం మదన్​రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ నియోజకవర్గ టిక్కెట్టును సునీతా రెడ్డి ఆశిస్తున్నారు. బీఆర్​ఎస్​ పార్టీ ఎవరికి స్నేహ హస్తం అందిస్తుందో, ఎవరికి మొండి చేయి చూపుతుందో తెలుసుకోవాలంటే మరి కొన్ని క్షణాలు వేచి చూడాల్సిందే.

Latest Articles

బాలయ్య సినిమాల.. ప్లానింగ్ మారుతుందా..?

నందమూరి బాలకృష్ణకి.. షూటింగ్లో గాయాలు అవ్వడం తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో బాలయ్య సినిమాల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్