పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధకు మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో విచారణకు రావాలని పేర్ని జయసుధకు మచిలీపట్నం పోలీసులు నోటీసులు ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆర్ పేట పోలీస్ స్టేషన్కు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పోలీసులు వెళ్లిన సమయంలో పేర్ని జయసుధ ఇంట్లో లేరు. దీంతో ఇంటి గోడకు నోటీసులు అంటించి పోలీసులు వెళ్లిపోయారు.
ఈ కేసులో ఇప్పటికే పేర్ని జయసుధకు జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. మంగళవారం రాత్రి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు పేర్ని నాని ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అతికించారు.