స్వతంత్ర, వెబ్ డెస్క్: వైఎస్సార్ యంత్ర సేవా పథకం రెండో విడత మెగా మేళాను సీఎం జగన్ ఇవాళ ఉదయం గుంటూరులో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రూ. 361.29 కోట్లు విలువచేసే 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లను రైతులకు ఆయన పంపిణీ చేశారు. అంతేకాకుండా 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను కూడా అందజేశారు. అనంతరం రైతులతో కలిసి కాసేపు సరదాగా ట్రాక్టర్ తోలారు.
అనంతరం బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. రైతులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందడమే తన లక్ష్యమని. అన్నదాతలకు అండగా నిలిచి గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఇందుకోసం వైఎస్సార్ యంత్ర సేవా పథకం తీసుకొచ్చామన్నారు. అలాగే ప్రతీ ఆర్బీకే పరిధిలో తక్కువ ధరకు యంత్ర పనిముట్లు అందజేస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే అక్టోబర్లో 7లక్షల మందికి లబ్ధి చేకూరేలా యంత్రాలు అందిస్తామని జగన్ వెల్లడించారు.