ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పోలింగ్కు సర్వం సిద్ధమైంది. జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పాలమూరు పార్లమెంట్ పరిధిలో మొత్తం 16, 82, 470 మంది ఓటర్లు ఉండగా, 1, 937 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ 31 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో 17,38,254 మంది ఓటర్లు ఉండగా, 2వేల 57 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్తో పాటు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక పోలింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారం మాప్రతినిధి వెంకటేష్ అందిస్తారు.