కామారెడ్డి జిల్లాలో ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంది. గెస్ట్ హౌజ్లు, రిసార్టులు, కల్యాణ మండ పాలు, ఫంక్షన్ హాల్స్, హోటళ్ళు, లాడ్జిలు తదితరాలన్నింటా తనిఖీలు ముమ్మరం చేశారు. అయితే పోలింగ్ శాతం గణనీయంగా తగ్గుతుండడాన్ని సీరియస్గా తీసుకున్న ఎలక్షన్ కమిషన్ ఈసారి అన్ని ప్రైవేటు కంపెనీలు, పరిశ్రమలు పోలింగ్ రోజున విధిగా హాలీడే ప్రకటించాలంటూ కమిషన్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించు కోడానికి ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని స్పష్టం చేశారు.