తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో సార్వత్రిక ఎన్నికలకు ఈవీఎంల పంపిణీ జరుగుతోంది. ఎన్నికల విధులకు హాజరైన ఉద్యోగులకు గుర్తింపు కార్డులతోపాటు ఈవీఎంలను పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 2,140పో లింగ్ కేంద్రాలు సిద్థం చేశారు. 694 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు తిరుపతి నియోజకవర్గ ఎన్నికల అధికారి అతిథి సింగ్ తెలిపారు. పార్లమెంటు నియోజక వర్గం పరిధిలో 964 పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులను నియమించారు. 888 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సరళిని చిత్రీకరించనున్నారు. 5వేల మందికి పైగా పోలీసులు, కేంద్ర బలగాలు పోలింగ్ కేంద్రా లను ఏర్పాటు చేసినట్లు అతిథి సింగ్ తెలిపారు.