సింగపూర్లో ఏపీ సీఎం చంద్రబాబు బృందం పర్యటన కొనసాగుతోంది. స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో చంద్రబాబు భేటీ అయ్యారు. సంస్కరణల్లో భారత్ దూసుకెళ్తోందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. చైనా ఆర్థిక అభివృద్ధికి దశాబ్దాలు పట్టిందని.. కానీ భారత్కు అంత సమయం పట్టడం లేదని అన్నారు. ఆధునిక పరికరాల తయారీలో భారత్ అగ్రస్థానంలో ఉందన్నారు. భూసమీకరణ ద్వారా ప్రాజెక్టులకు భూములు ఇస్తున్నామని.. అమరావతి రాజధాని ఈ ప్రాతిపదికనే నిర్మిస్తున్నామని వెల్లడించారు.
పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.
స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో చంద్రబాబు భేటీ
Latest Articles
- Advertisement -


