వచ్చే ఐదేళ్లు దేశాన్ని పాలించే సరైన నాయకుడిని ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రజలు తమ సొంత ఊర్లకు వెళ్తున్నారు. పట్నం నుంచి ఓటర్లు పల్లెబాట పట్టడంతో హైదరాబాద్ ఖాళీ అయింది. ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. హైదరాబాద్ నుంచి ఎక్కువగా విజయవాడ, కాకినాడ, తిరుపతి, విశాఖ పట్నం, తూర్పు గోదావరి,. ఒంగోలు, గుంటూరు, జిల్లాలకు ఆంధ్ర ఓటర్లు బయలుదేరారు. ఇక హైదరా బాద్ నుంచి తమ సొంత నియోజకవర్గాలకు తెలంగాణ ఓటర్లు వెళ్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు.