33.8 C
Hyderabad
Monday, April 28, 2025
spot_img

300 అడుగుల బోరు బావిలో పడిపోయిన చిన్నారి..

స్వతంత్ర వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్​ సీహోర్ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం 300 అడుగుల లోతులో ఉన్న బోరు బావిలో పడిపోయింది రెండున్నరేళ్ల చిన్నారి. కాగా చిన్నారి ప్రస్తుత పరిస్థితిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సీహోర్​ జిల్లా ముగావళి గ్రామానికి చెందిన సృష్టి అనే రెండున్నరేళ్ల చిన్నారి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిపోయినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం మధ్యాహ్నం నుంచే సహాయక చర్యలు ప్రారంభించారు. చిన్నారిని సురక్షితంగా బయటకు తీసేందుకు జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. దాదాపు 6 ప్రొక్లేయినర్​లు, జేసీబీ ఇతర యంత్రాలతో ఎన్​డీఆర్​ఎఫ్​ బృందం రెస్య్కూ ఆపరేషన్ చేపట్టింది. తాడు సహాయంతో చిన్నారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొదట 30 అడుగుల లోతులో ఉన్న చిన్నారి ప్రస్తుతం 50 అడుగుల లోతులోకి జారినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్​సింగ్​ చౌహాన్.. తన సొంత జిల్లాలో జరిగిన ఈ ఘటనపై ఆయన ఆరా తీశారు. సహాయక చర్యలు వేగవంతం చేసి, చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్