అస్వస్థతకు గురైన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ప్రధాని మోదీ ఫోన్ ద్వారా పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జమ్మూకశ్మీర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఖర్గే స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఓ సభలో ప్రసంగిస్తున్న సమయంలో ఆయన సొమ్మసిల్లారు. ఆయన పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది, పార్టీ నేతలు ఆయన్ను పట్టుకుని నీళ్లు తాగించారు. ఆ తర్వాత కోలుకున్న ఖర్గే తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం తనకు 83 ఏళ్లు వయస్సు ఉందని.. అంత త్వరగా చనిపోనని, ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించే వరకు క్రియాశీలకంగా పనిచేస్తానని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ టార్గెట్గా బీజేపీపై విమర్శలు గుప్పించారు.
మల్లికార్జున ఖర్గేకు ఫోన్ చేసిన ప్రధాని మోదీ
0
164
Previous article
Next article
Latest Articles
టీడీపీలో దిద్దుబాటు చర్యలు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భవిష్యత్ ప్రయాణంపై సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కేవలం సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకుని అంతా సవ్యంగానే ఉందనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి...
- Advertisement -
- Advertisement -


