21.7 C
Hyderabad
Tuesday, March 11, 2025
spot_img

‘ఆహా’ తెలుగు ఇండియన్ ఐడల్-3 విన్నర్‌గా నజీరుద్దీన్.. ‘ఓజీ’లో పాడే ఛాన్స్!

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా వైవిధ్యమైన కార్యక్రమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో ప్రసారమవుతున్న కార్యక్రమాల్లో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కి ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ పాటల కాంపిటీషన్‌లో కొత్త ట్యాలెంట్‌ను ప్రోత్సహిస్తూ వారిలోని ప్రతిభను ప్రపంచానికి చాటిచెబుతున్నారు.

హైదరాబాద్: ఆహా ఓటీటీలో ప్రసారమైన ఉత్కంఠభరితమైన గ్రాండ్ ఫినాలేలో, ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 విజేతగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల నజీరుద్దీన్ షేక్ నిలిచాడు. విజేతగా నిలిచిన నజీరుద్దీన్ ప్రతిష్టాత్మక టైటిల్‌తో పాటు, నగదు బహుమతిగా రూ. 10 లక్షలు సొంతం చేసుకున్నాడు. ఇటీవలే సీఏ ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన నజీరుద్దీన్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం ‘ఓజీ’లో పాట పాడే అవకాశాన్ని కూడా అందుకున్నాడు.

ఇక అనిరుధ్ రెండో స్థానంలో నిలిచి రూ. 3 లక్షలు, జివి శ్రీ కీర్తి తృతీయ స్థానంలో నిలిచి రూ. 2 లక్షలు సొంతం చేసుకున్నారు. దాదాపు 26 వారాల విపరీతమైన పోటీ తర్వాత ముగిసిన ఈ షోలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్, సింగర్స్ గీతా మాధురి, కార్తీక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

జడ్జి గీతా మాధురి మాట్లాడుతూ, “ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ప్రతిభావంతులైన పోటీదారులతో నిండిన అద్భుతమైన అనుభవం. ఇది నిజంగా సంగీత వేడుకలా అనిపించింది. ఫైనలిస్ట్‌లను ఎంచుకోవడం చాలా సవాలుగా ఉంది. ప్రతి ఎలిమినేషన్ బాధాకరంగా అనిపించింది.” అని తెలిపింది.

ఏపీలోని తాడేపల్లిగూడెంలోని మోటార్ మెకానిక్ అయిన షేక్ బాజీ, మదీనా బీబీ దంపతులకు నజీరుద్దీన్ జన్మించాడు. అతని సోదరి, వహిదా రెహ్మాన్, వారి తల్లి మరణించిన తరువాత అతనికి మద్దతుగా ముందుకు వచ్చారు. అతను విజ్ఞాన వికాస్ E.M స్కూల్లో తన పాఠశాల విద్యను పూర్తి చేసాడు. GSR E.M స్కూల్లో తన విద్యను కొనసాగించాడు. అతను తన జూనియర్ కళాశాల, CA ఇంటర్మీడియట్‌ను గుంటూరులోని శ్రీ మేధా కామర్స్ కళాశాలలో అభ్యసించాడు. సంగీతంపై తనకున్న అభిరుచిని పెంచుకుంటూ చార్టర్డ్ అకౌంటెంట్ చదువుతున్నాడు.

నజీరుద్దీన్ తన విజయాన్ని గుర్తు చేసుకుంటూ, “నాకు నాలుగేళ్ల వయసులో సంగీతంతో నా ప్రయాణం మొదలైంది. నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసింది మా తాత కాసిం, అతని సోదరి నాని అని నేను ఆప్యాయంగా పిలుస్తాను. మా ఊరు తాడేపల్లిగూడెంలో మా తాతగారి కృషితో ఘంటసాల గారి విగ్రహం నెలకొల్పాము. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 టైటిల్ గెలవడం నాకు కీలక మైలురాయి. థమన్ సర్, గీతా మాధురి మేడమ్, కార్తీక్ సర్‌ల ముందు ప్రదర్శన ఇవ్వడం గౌరవంగా ఉంది. నా తోటి పోటీదారుల నుండి పాఠాలతో పాటు ఎన్నో విషయాలు నేర్చుకున్నా. గాయకుడిగా నా ఎదుగుదల, ఫైనాన్స్‌లో వృత్తిని కొనసాగిస్తూనే పరిశ్రమలో ప్రముఖ సంగీతకారుడిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాను.’’ అని చెప్పారు.

సీజన్ మొత్తంలో అపారమైన ప్రతిభను కనబరుస్తూ 15,000 మంది ఔత్సాహిక గాయకులతో పోటీ ప్రారంభమైంది. ప్రారంభ ఆడిషన్‌లు మే 4, 2024న న్యూజెర్సీ, హైదరాబాద్‌లో జరిగాయి. టాప్ 12 ఫైనలిస్టులలో భరత్ రాజ్, కీర్తన, కేశవ్ రామ్, హరి ప్రియ, జివి శ్రీ కీర్తి, నజీరుద్దీన్, స్కంద, దువ్వూరి శ్రీధృతి, రజనీ శ్రీ, సాయి వల్లభ, ఖుషాల్ శర్మ, అనిరుధ్ సుస్వరం ఉన్నారు. 28 ఎపిసోడ్‌లలో కఠినమైన ఎలిమినేషన్‌లు, పబ్లిక్ ఓటింగ్ తర్వాత నజీరుద్దీన్ విన్నర్‌గా నిలిచాడు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్