స్వతంత్ర వెబ్ డెస్క్: తిరుపతిలో జరిగిన మూడు తరాల మనిషి పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న టీటీడీ(TTD) చైర్మన్ తనపై సోషల్ మీడియాలో(Social Media) దుష్ప్రచారం చేసేవారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విమర్శలకు భయపడేవాడిని కాదని, 17 సంవత్సరాల క్రితమే టీటీడీ చైర్మన్ అయిన వ్యక్తిని అని ఆయన అన్నారు. శ్రీవారి దయతో 30 వేల మందికి కళ్యాణమస్తు ద్వారా సామూహిక వివాహాలు చేయించానని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా.. తిరుమల ఆలయ నాలుగుమాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగకూడదనే నిర్ణయం తీసుకుంది నేనే అని ఆయన వ్యాఖ్యానించారు.
అన్నమయ్య 600 వర్ధంతి ఉత్సవాలు చేసిందీ నేనే అని ఆయన వెల్లడించారు. నా మీద క్రిస్టియన్ అని నాస్తికుడనని ఆరోపణలు చేస్తున్న వారికి ఇదే నా సమాధానమన్నారు భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana karunakar reddy). దళితవాడలకు శ్రీవెంకటేశ్వర స్వామిని తీసుకుని వెళ్ళి కళ్యాణం చేయించానని వివరించారు. ఆరోపణలకు భయపడి మంచి పనులు చేయడం ఆపే వాడిని కాదని, పోరాటాల నుండి పైకి వచ్చిన వాడిని ఇలాంటి వాటికి భయపడనని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.